కాకినాడ : చలిగాలులకు తప్పితే ఆస్తి, ప్రాణనష్టాన్ని నివారించగలిగామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పెథాయ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… ముందస్తు జాగ్రత్త చర్యల ద్వారా నష్ట నివారణ చర్యలు చేపట్టామన్నారు. ముందస్తుగా కోస్ట్ గార్డు, పోలీసులను అప్రమత్తం చేశామన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోగానే జనరేటర్లతో విద్యుత్ వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనాల ఏర్పాట్లు చేశామన్నారు. గతంలో తుఫాను ఎక్కడ తీరం దాటుతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. తుఫాన గమనాన్ని సరిగా అంచనా వేయగలగాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సేవలందించారన్నారు.