న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని.. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రటించామని కేంద్రం ఇవాళ రాజ్యసభలో స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రశ్న అడిగారు. హోదా ఇవ్వకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ.. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అమలులో లేదని చెప్పారు. ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని జైట్లీ గుర్తుచేశారు.