న్యూఢిల్లి : రైతుల రుణాలను మాఫీ చేసే వరకూ ప్రధాని నరేంద్ర మోడీని నిద్రపోనివ్వబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటి వరకూ ప్రధాని రైతుల రుణాలలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని ఆయన అన్నారు. తన ఎన్నికల ప్రసంగంలో ఇది పేద ప్రజలు, రైతులు, చిన్న దుకాణాల యజమానులకు పెద్ద పారిశ్రామిక వేత్తలకు మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పానని రాహుల్ గుర్తు చేశారు.