న్యూఢిల్లి : పంజాబ్లో 34 సంవత్సరాల క్రితం జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ తీర్పు వల్ల సిక్కులకు కొద్దిగా న్యాయం జరిగిందని ఆయన అన్నారు. అదే విధంగా 2002లో గుజరాత్లో జరిగిన హింసాకాండ, ముజఫర్పూర్ హింసాకాండలకు కారణమైన వారిని కూడా కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.