తూర్పుగోదావరి జిల్లాలో పెథాయ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రతినిధి ముత్తా గోపాలకృష్ణ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా పెథాయ్ తుఫాను బాధితులను ముత్తా గోపాలకృష్ణ పరామర్శించారు. చేపల వేటకు వెళ్లి తుఫాను ప్రభావంతో గల్లంతై తిరిగి క్షేమంగా చేరుకున్నమత్స్యకారులను ముత్తా గోపాలకృష్ణ పరామర్శించారు. తుఫాను ప్రభావంతో ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పెథాయ్ తుఫాను పలు ప్రాంతాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.