ఆగ్రా : ఉత్తర్ ప్రదేశ్లో ఫతేపూర్ సిక్రి నియోజక వర్గం ఎమ్మెల్యే ఉదయ్భాన్ చౌధరి కేరావాలి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డిఎం)ను బెదిరింపులకు గురి చేశారు. తాను ఎమ్మెల్యేనని, తన అధికారాన్ని గుర్తించలేదా అంటూ ఎస్డిఎం గరీమా సింగ్ను ఆయన బెదిరించారు. ”నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నావు. నువ్వు ఒక ఎస్డిఎం అని నాకు చెప్పాలనుకుంటున్నావా? ఒక నౌకరువి..’ అంటూ ఉదయ్భాన్ ఆవేశంతో ఊగిపోయారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు ఎమ్మెల్యే ఎస్డిఎం వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే కేకలు వేస్తుండగా ప్రజల్లో నుంచి కొందరు ‘ఎస్డిఎం జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.