నరసాపురం : ప్రభుత్వపరంగా మత్స్యకారులను ఆదుకుంటామని మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్ లు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మంత్రులు పర్యటిస్తున్న సందర్భంగా చిన్నమైనవానిలంక, పెదమైనవానిలంకలో మత్స్యకారులతో మంత్రులు మాట్లాడారు. పెథాయ్ తుఫాన్ తో నష్టపోయామని మత్స్యకారులు మంత్రులకు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు.