అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కేంద్రం నుండి తుఫాన్ ప్రభావం మీద సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ముఖ్యఅధికారులతో ఆర్టీజీఎస్ కేంద్రం నుండే పరిస్థితులను సమీక్షించారు. అధికారులు ముందుగానే స్పందించి చర్యలు తీసుకున్నారని..చురుగ్గా స్పందించి క్షేత్రస్థాయిలో అందరినీ సిద్ధం చేశారన్నారు. అత్యవసర సమయంలో అన్నిశాఖల్లో అధికారులు అందుబాటులో ఉండాలని.. విపత్తు ప్రభావంపై డాక్యుమెంటరీ చేయాలనీ.. దానివలన భవిష్యత్ లో విపత్తులను ఎదుర్కోడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యుత్ స్థంబాల పునరుద్ధరణ జియో ట్యాగింగ్ ద్వారా సులభం అవుతుందని.. ఆ దిశగా అధికారులు పనిచేయాలన్నారు.