అమరావతి: పెథాయ్ తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా జోరు వానలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరందాటే సమయంలో వీచిన పెనుగాలులకు సెల్ ఫోన్ వ్యవస్థ అతలాకుతలం అయింది. మొత్తం ఆరు జిల్లాల్లో 297 టవర్లు కూలినట్లుగా ప్రాధమిక అంచనా ఉండగా సిబ్బంది మరమత్తులు మొదలుపెట్టారు. వర్షాభావం తగ్గిన మండలాలలో మరమత్తులు వేగవంతం చేశారు.