కాకినాడ : పునరావాస కేంద్రాల్లో భోజనం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని మంత్రి నారాయణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 283 సహా 486 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పదివేల విద్యుత్ స్తంభాలను సిద్దంగా ఉంచామన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ముందస్తు సమాచారంతో రైతులు పంటలు కోశారన్నారు. కోసిన పంటను కొనుగోలు చేసే పనులు చేపట్టారన్నారు. పంటనష్టపై అధికారులు అంచనా వేస్తున్నారన్నారు.