విశాఖపట్టణం : పెథాయ్ తుపాను ఆంధ్రప్రదేశ్ ను గజ గజ వణికిస్తోంది. విశాఖలోని భీమిలి బీచ్ లో ఏపీ రాష్ర్ట మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు కారు ఇసుకలో కూరుకుపోయింది. పెథాయ్ తుపాను నేపథ్యంలో మత్స్యకారులను పరామర్శించి.. వారికి అందుతున్న సహాయక చర్యల గురించి తెలుసుకునేందుకు మంత్రి ఇవాళ ఉదయం భీమిలి బీచ్ కు వెళ్లారు. అయితే బీచ్ లోని ఇసుక మీదుగా డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్తుండగా.. ఇసుకలోనే కారు చక్రాలు దిగబడ్డాయి. దీంతో పోలీసు సిబ్బంది, ఇతరులు చాలాసేపు కష్టపడి కారును బయటికి తెచ్చారు. మొత్తానికి మంత్రి గంటా శ్రీనివాస్ రావు సురక్షితంగా బయటపడ్డారు.