పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పెథాయ్ తుఫాను ప్రభావంతో జిల్లాలోని నర్సాపురం, భీమవరం తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావం, ఎడతెరిపిలేని వర్షం కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. భీమవరం మండలం నాగిడిపాలెం, లోసరి, దొంగపిండిలో సహాయక చర్యలు చేపట్టారు. మూడు గ్రామాల నుంచి 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 9 మంది గర్భిణీలను భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.