అమెరికా: అమెరికాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరో రోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా డల్లాస్లో డాక్టర్లతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ అమెరికా పర్యటన ఈ నెల 17 వరకు కొనసాగనుంది. డబ్బుతో సమాజంలో మార్పు సాధ్యం కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తనకు రాజకీయం తెలియదని, మానవత్వం మాత్రమే తెలుసన్నారు. తుదిశ్వాస వదిలేలోపు సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తానన్నారు. ఉద్దానం సమస్య పరిష్కారానికి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అమెరికా పర్యటనలో పవన్ ప్రవాసగర్జనలో పాల్గొన్న విషయం తెలిసిందే.