అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా డీఎంకే కార్యాలయంలో జరిగే అన్నాదురై, కరుణానిధి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు. సీఎస్ పునేఠా కుమార్తె వివాహ వేడుకకు చంద్రబాబు హాజరుకానున్నారు.