నెల్లూరు : చంద్రబాబునాయుడు నందమూరి కుటుంబాన్ని మరోసారి మోసం చేశారని దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. అవినీతి సొమ్ముతో ఓటర్లను కొనాలనుకున్నాడని... కానీ తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబును ఓడించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అన్న రంగాల్లోనూ దోపిడీ బాగా పెరిగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లామ్ వెల్లడించిన వివరాలతో ప్రజలు విస్తూ పోతున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు మీద చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని లక్ష్మీపార్వతి ఆరోపించారు.