అమృత్సర్: పంజాబ్కు చెందిన కౌంటర్ ఇంటలీజెన్స్ బృందం ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి 4 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా వారి దగ్గరి నుంచి స్వదేశీ నాటు తుపాకీ, పాకిస్తాన్ సిమ్ కార్డుతో పాటు ఒక ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడ్డ నిందితులిద్దరూ బసంత్ సింగ్ (23), మంజిందర్ సింగ్ (24) అని పోలీసులు తెలిపారు.
వీరికి సరిహద్దు ఆవలితో సంబంధాలు ఉన్నాయని చెప్పారు.ఈ విషయమై పంజాబ్ కౌంటర్ ఇంటలీజెన్స్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ అమర్జిత్ సింగ్ మాట్లాడుతూ ‘‘పక్కా సమాచారంతోనే వెళ్లాం.హెరాయిన్ తరలిస్తుండగా ఇద్దరినీ పట్టుకున్నాం. అట్టారా సరిహద్దులో వారు పట్టుబడ్డారు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.