న్యూఢిల్లీ: రాఫెల్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పుతో అంతా తేటతెల్లమైందని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. కుటుంబరావు పెద్ద స్కాం బయటపెడతానని చెప్పి లేని కుంభకోణాన్ని సృష్టించారని విమర్శించారు. తెలుగుదేశం ఓ డ్రామా కంపెనీ అని, జనం పట్టించుకునే పరిస్థితిలో లేరని అన్నారు. చంద్రబాబు పట్ల కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాబుతో స్నేహం చేస్తే తెలంగాణలో మాదిరిగా మళ్లీ చేతులు కాల్చుకుంటారని కన్నా ఎద్దేవా చేశారు. కాపు, వాల్మీకి, బోయల రిజర్వేషన్లపై రాజ్నాథ్, ఓరంలతో మాట్లాడామని అన్నారు. చంద్రబాబు అన్ని కులాలను మోసం చేశారన్న విషయాన్ని కేంద్ర మంత్రులకు వివరించామని కన్నా లక్ష్మినారాయణ పేర్కొన్నారు.