కడప: నగరంలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ను ఏపీ హోం మంత్రి చినరాజప్ప శుక్రవారం ప్రారంభించారు. అలాగే సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ సిస్టంను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు టెక్నాలజీని వినియోగించుకుంటామన్నారు. త్వరలో పోలీస్శాఖలో 15వేల పోస్టుల భర్తీ చేయనున్నట్లు హోంమంత్రి చెప్పారు. జగన్ ఎప్పటికీ గెలవలేరని.. కాబట్టే తెలంగాణలో ఎవరో గెలిస్తే వైసీపీ నేతలు ఇక్కడ సంబరాలు చేసుకున్నారని చినరాజప్ప ఎద్దేవా చేశారు. ఈనెల 27న కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని చినరాజప్ప తెలిపారు.