న్యూఢిల్లీ: విభజన హామీలు నెరవేర్చాలంటూ పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ సహా అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మరోవైపు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఈరోజు కరుణానిధి వేషధారణలో పార్లమెంటుకు వచ్చి నిరసన తెలిపారు. స్నేహధర్మాన్ని పాటించకుండా చంద్రబాబును మోదీ మోసం చేశారని ఎంపీ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చలేదని అన్నారు.