హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై కోడి కత్తి దాడి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు నివేదికను సీఐఎస్ఎఫ్ కోర్టుకు అందజేసింది. కాగా నివేదిక సరిగ్గా లేదంటూ సీఐఎస్ఎఫ్పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ హైకోర్టు కేసును వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.