న్యూఢిల్లీ: ఆర్బీఐలో చోటుచేసుకున్న పరిణామాలు, నోట్ల రద్దు అంశంపై చర్చ చేపట్టాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్సభలో ఈ అంశాలను చర్చించాలని ఎంపీ రంజీత్ రంజన్ వాయిదా తీర్మానం ఇచ్చారు. మరో ఎంపీ సునిల్ కుమార్ రాఫెల్ అంశాన్ని చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు.