మంత్రి నారా లోకేష్ ని కలిసిన ఉపాధిహామీ పథకం సిబ్బంది.ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపిన ఉపాధిహామీ పథకం సిబ్బంది. ఉపాధిహామీ పథకం సిబ్బందికి లబ్ది చేకూర్చేలా ఇటీవల తీసుకున్న నిర్ణయాలు. ఉపాధిహామీ పథకం లో కీలకం గా ఉన్న క్షేత్ర సహాయకులను ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగస్తులు గా నియమిస్తూ నిర్ణయం
ఈ నిర్ణయం వలన 12 వేల మందికి పైగా క్షేత్ర సహాయకులకు లబ్ది. 288 ఆఫీస్ సబ్ ఆర్డీనేట్లు,డ్రైవర్ల ను ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగస్తులు గా నియమిస్తూ నిర్ణయం.లిస్ట్ 2 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ మేట్ల వేతనాలు 4500 నుండి 5500 పెంపు,పెంచిన జీతం 2018,జులై నెల నుండి ఇవ్వాలి అని నిర్ణయంఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు, జూనియర్ మేట్లు,సీనియర్ మేట్ల ప్రమాదంలో చనిపోతే ఇచ్చే పరిహారం 3 లక్షల నుండి ఐదు లక్షలకు పెంపు
చంద్రన్న భీమా తో సంబంధం లేకుండా ఐదు లక్షలు పరిహారం. ఉపాధిహామీ పథకంలో పని చేసే సిబ్బంది ప్రమాదంలో చనిపోతే చంద్రన్న భీమా 5 లక్షలు,పరిహారం 5 లక్షలు మొత్తంగా 10 లక్షలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి అని నిర్ణయం. ప్రస్తుతం ఇస్తున్న 5 వేల రూపాయల నుండి 15 వేలకు పెంపు. ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది
తల్లి,తండ్రులకు కూడా మెడికల్ రిఎంబర్స్మెంట్ వర్తింపుఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది నగదు రహిత వైద్య సేవలు అందించేలా ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి అని నిర్ణయం. చెంచు ప్రాంతంలో పనిచేస్తున్న 34 మంది సిబ్బందిని ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగస్తులు గా నియమిస్తూ నిర్ణయం. ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది.
జీతభత్యాలు,గ్రేడ్ల విధానంలో ఉన్న వ్యత్యాసాన్ని అధ్యయనం చేసి ఉద్యోగస్తులకు మరింత మేలు చేసే విధంగా గ్రామీణాభివృద్ధి స్పెషల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. ఉద్యోగస్తులకు మరింతగా లబ్ది చేకూర్చేందుకు సమగ్ర హెచ్ఆర్ పాలసీ రూపొందించాలి అని నిర్ణయం. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ప్రస్తుతం ఇస్తున్న 30 రోజుల సాధారణ సెలవులతో పాటు మరో 20 రోజులు జీతం తో కూడిన సెలవులు ఇచ్చేందుకు అంగీకారం.ఎన్టిఆర్ వైద్య సేవ గుర్తింపు ఉన్న ఆసుపత్రుల నుండి అవసరమైన పత్రాలు ఇవ్వడం తప్పనిసరి. జూనియర్ మేట్లు,సీనియర్ మేట్లు పేర్లను ఫీల్డ్ అస్సిస్టెంట్స్ గా మార్చాలి అని నిర్ణయం