పాట్నా : కాంగ్రెస్ లోక్సభ ఎంపి, ప్రముఖ ఇస్లామిక్ పండితుడు మౌలానా అస్సర్ ఉల్ హక్క్ ఖాస్మి(76) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. బీహార్లోని కిషన్గంజ్ నియోజకవర్గానికి ఎంపిగా వ్యవహరిస్తున్నారు. 2009లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు. కాగా, గతంలో ఇదే నియోజకవర్గం నుండి ఐదుసార్లు పోటీచేసి వరుస వైఫల్యాలను చవిచూశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి దిలీప్ కుమార్ జైస్వాల్పై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు కూడా. ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ వ్యవస్థాపకుడు.