ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వలసలపై అసెంబ్లీలో చర్చ జరపాలి: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 06, 2018, 06:57 PM

అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన బహిరంగ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ కరువు మీద అసెంబ్లీలో చర్చ జరపాలన్నారు. రాయలసీమలో కొన్ని ప్రాంతాలను కొందరు నేతలు ఓటు బ్యాంకుగా చూసినంత కాలం ఇక్కడ అభివృద్ధి అనేది జరగదన్నారు. ఇజ్రాయెల్ త్వరగా వ్యవస్థను రాయలసీమ వ్యవసాయంలో అమలుచేయాలన్నారు. రాష్ట్రంలోని రైతులంతా ఆనందంగా ఉన్నారని సీఎం చెబుతున్నారని.. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న సమస్యలను మభ్యపెట్టి భ్రమలు కల్పిస్తున్నారన్నారు. రాయలసీమలో సమగ్రమైన నీటి ప్రణాళికను అమలుచేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా రాజకీయ వ్యవస్థలేదని.. ప్రక్షాళన చేయడం కోసం జనసేన మీ ముందుకు వచ్చిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com