ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు బాధ పడడం చూసి చలించిపోయిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 08:36 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తుపాను కారణంగా దెబ్బతిన్న బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పర్యటించారు. చెరుకూరు గ్రామంలో పంటలపై తుపాను ఏ విధంగా ప్రభావం చూపిందే ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబు చెరుకూరు గ్రామం మీదుగా వెళుతుండగా... గడ్డం శ్రీనివాసరావు అనే రైతు మిరప పంటను పీకేస్తూ కనిపించాడు. వెంటనే ఆగిన చంద్రబాబు... ఆ రైతును పలకరించారు. తాను 6 ఎకరాల్లో మిరపపంట వేశానని, తుపాను రావడంతో పొలంలో నీరు నిలిచిపోయి మిరప మొక్కలు కుళ్లిపోయాయని రైతు శ్రీనివాసరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక చేసేది లేక పంటను పీకేస్తున్నానని వెల్లడించాడు. తన పెట్టుబడి, శ్రమ అంతా వృథా అయిందని ఆ రైతు బాధ పడడం చూసి చంద్రబాబు చలించిపోయారు. అప్పటికప్పుడు రైతు శ్రీనివాసరావుకు రూ.2 లక్షల సాయం ప్రకటించారు. ధైర్యంగా ఉండాలని ఆ రైతును ఓదార్చారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, రైతులందరినీ ఆదుకుంటామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com