ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట తప్పింది: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 21, 2018, 04:14 PM

చెన్నై: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట తప్పిందన్న పవన్ పెద్దనోట్ల రద్దు అంశం దేశంలో ప్రజలను నానాఇబ్బందులుకు గురిచేసిందన్నారు. 2014లో జనసేన పార్టీ స్థాపించినా ప్రజాప్రయోజనాల కోసమే అనుభవం ఉన్న నాయకుడైతేనే రాష్ట్రాన్ని నడిపించగలరని ఆనాడు టీడీపీకి మద్దతు ఇచ్చానన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వమే అవినీతి కూరుకుపోయిందన్నారు. తమళనాడు నుండి బాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడితే ప్రత్యేక పరిస్థితులలో తెలంగాణ ఏర్పడిందన్నారు. దేశంలో దక్షణాదిలో రెండో రాజధాని కూడా ఉండాలని అంబేద్కర్ ఆనాడే చెప్పారని.. ప్రస్తుతం దేశంలో ఉత్తరాది రాష్ట్రాలే పెత్తనం చేస్తున్నాయని.. ఇది ప్రమాదకరంగా మారనుందన్నారు.


చెన్నైలో ఓ సమావేశంలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ విభజనకు కాంగ్రెస్, బీజేపీయే కారణం అన్నారు. తెలంగాణలో ఆంధ్రా వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూశారని.. చెన్నైలో నాకెప్పుడూ అలాంటి భావన కలగలేదన్నారు. విభజన వలన నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్న పవన్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే అప్పుడు బీజేపీ-టీడీపీకి మద్దతు ఇచ్చానని.. ఇప్పుడు టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందని.. అందుకే రాజకీయాలలో మార్పు కోసమే ఇలా రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ తనవంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com