ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 21, 2018, 02:42 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి, ఆహ్వానం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో, బౌన్సర్ల సాయంతో ఆయన కారులోకి చేరుకున్నారు. మరో అరగంటలో ఆయన మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈరోజు ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ చెన్నై పర్యటన నేపథ్యలో, సర్వత్ర ఆసక్తి నెలకొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com