జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి, ఆహ్వానం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో, బౌన్సర్ల సాయంతో ఆయన కారులోకి చేరుకున్నారు. మరో అరగంటలో ఆయన మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈరోజు ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ చెన్నై పర్యటన నేపథ్యలో, సర్వత్ర ఆసక్తి నెలకొంది.