కృష్ణా : ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజవర్గం ఉల్లిపాలెంలో పర్యటిస్తున్నారు. అక్కడ తెలుగు తల్లి భారీ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అంతకంటే ముందు ఉల్లిపాలెం-భవానిపురం వంతెను ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బుద్ధప్రసాద్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, నేతలు కొనకళ్ల నారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.