విజయవాడ: కృష్ణా జిల్లా ఉల్లిపాలెంలో రూ. 77 కోట్ల తో నిర్మించిన ఉల్లిపాలెం-భవానిపురం వారధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అలాగే దేశంలోనే అతిపెద్ద తెలుగుతల్లి విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, పార్లమెంట్ సభ్యులు నారాయణ, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనురాధ, తదితరులు పాల్గొన్నారు. 1977 ఉప్పన ఛాయా చిత్రాలను సీఎం చంద్రబాబు తిలకించారు.