పోర్ట్బ్లెయిర్: అండమాన్ దీవుల్లో అమెరికాకు చెందిన పర్యాటకుడు జాన్ అల్లెన్ చాహూ హత్యకు గురయ్యాడు. స్థానిక తెగకు చెందిన ప్రజలు అతన్ని బాణాలతో చంపేశారు. ఈ కేసులో అండమాన్ పోలీసులు ఏడు మందిని అరెస్టు చేశారు. అక్కడున్న జాలర్లు టూరిస్టు జాన్ను నార్త్ సెంటినల్ దీవికి తీసుకువెళ్లారు. ఆ దీవిలో ఉన్న సెంటినేలీజ్ తెగ ప్రజలు పర్యాటకుడిని చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానిక తెగ ప్రజలు తమ దగ్గర ఉన్న విల్లు, బాణాలతో అమెరికా టూరిస్టును హత్య చేసినట్లు జాలర్లు తెలిపారు. టూరిస్టు జాన్ మృతదేహం కోసం అండమాన్ పోలీసులు హెలికాప్టర్తో గాలిస్తున్నారు. అయితే హెలికాప్టర్లను దీవిపై దించడం లేదని, ఎందుకంటే స్థానిక తెగ ప్రజలు ఎవర్నీ దగ్గరకు రానివ్వరని పోలీసులు అన్నారు. ప్రస్తుతం ఆ దీవిలో సెంటినేలేజ్ తెగ ప్రజలు సుమారు 50 మంది ఉంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.