అమరావతి : రాష్ట్రానికి రూ.8వేల కోట్ల టర్నోవర్ ఉన్న 10 సంస్థలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మేక్ ఇన్ ఏపీ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. స్టార్టప్ కంపెనీలు, పరిశ్రమలతో విద్యార్థులను అనుసంధానం చేసేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రానున్న ఐదేళ్లలో 10వేల స్టార్టప్ లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికతీసే బాధ్యత కళాశాలలపై ఎంతో ఉందన్నారు. స్టార్టప్ ప్రమోషన్ కు ప్రతి జిల్లాకు రూ.10కోట్ల చొప్పున రూ.130కోట్లు కేటాయిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.