న్యూఢిల్లి : ఆరెస్సెస్ కార్యకర్తలు తాలిబన్, ఖలిస్తాన్ ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ఎస్ రామచంద్రన్ పిళ్లై అన్నారు. శబరిమలలో ఆరెస్సెస్ కార్యకర్తల తీరును ఆయన నిశితంగా విమర్శించారు. శబరిమలలో వారు సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతీదీ శాంతియుతంగా సాగేలా ఆరెస్సెస్ కార్యకర్తలు వ్యవహరించాలని ఆయన అన్నారు. అయితే వారు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.