ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన సిద్దాంతాలు ప్రజల్లో తీసుకువెళ్లాలి: తూగోజిల్లా కోఆర్డినేటర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 20, 2018, 06:25 PM

జనసేన సిద్దాంతాలు ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్ళేందుకు జనసైనికులు కృషి చేయాలని జనసేన జిల్లా కోఆర్డినేటర్ మేడాగురుదత్ ప్రసాద్ పేర్కొన్నారు. మండపేట జనసేన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కులాలని కలిపే ఆలోచన విధానం జనసేన పార్టీదని పేర్కొన్నారు. మతాల ప్రస్తావనలేని రాజకీయం తమ నాయకుడు పవన్ తో సాధ్యమన్నారు. భాషల్ని గౌరవించే సంప్రదాయమన్నారు. సంస్కృతులని కాపాడే సమాజం కావలనేదే లక్ష్యం అని తెలిపారు. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదమని పేర్కొన్నారు. ఇవి దేశపటిష్టతకు మూలాలన్నారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత జన సైనికులదే నని స్పష్టం చేశారు. 


జిల్లాలో మూడవ విడత యాత్రలో భాగంగా జిల్లాలో ఈ నెల 23న నిర్వహించే బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆటోలద్వారా ప్రచారం నిర్వహించి జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిల్లా సత్యనారాయణ, మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లుతదితరులు ప్రసంగించారు.వాదా ప్రసాదరావు,శెట్టి ఆనంద్,గొళ్ల శ్రీను, సత్తి శ్రీను, హోదా ప్రసాదరావు చింత శ్రీను, గందం సురిబాబు,కోనల సుభాష్ చంద్రబోస్, శాఖ నాగేంద్ర, కవల కొండబాబు,కుంచె దుర్గాప్రసాద్,రాలి ఆంజనేయులు, చిక్కల రాజా,మండ వీరాభద్రరావు, సలాది లక్ష్మీనారాయణ వాసిరెడ్డి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com