మధ్యప్రదేశ్ : దేశంలో వేళ్లూనుకునిపోయిన అవినీతికి చికిత్స చేయడం కోసమే పెద్ద నోట్ల రద్దు అనే చేదు మాత్రను ఉపయోగించానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 14 కోట్ల మందికి ఎలాంటి గ్యారంటీలు లేకుండా రుణాలిచ్చామని ఆయన అన్నారు. తాము నాలుగేళ్లలో సాధించిన వాటిని చేయడానికి కాంగ్రెస్కు కనీసం 10 ఏళ్లు పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రజాసంక్షేమం పట్టని ప్రభుత్వం మధ్యప్రదేశ్కు అవసరం లేదని ఆయన అన్నారు.