ముంబై : ఓలా, ఉబేర్ సంస్థల టాక్సీల డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు రైల్ రోకో నిర్వహించారు. దాదర్ రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫారంపై చేరుకున్న డ్రైవర్లు ఒక రైలును కొద్దిసేపు నిలిపివేసి పట్టాలపై కూర్చుని నినాదాలు చేశారు. కాగా డ్రైవర్లకు మద్దతుగా మహారాష్ట్ర రాష్ట్ర రాజ్య కామ్గార్ సంఘ్, మరాఠీ కామ్గార్ సేన కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ఆ రెండు సంస్థలు రైల్ రోకోతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాయి.