అమరావతి : భూధార్ తీసుకురావడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. భూసేవ వెబ్ సైట్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ… అవినీతి రహిత పాలన అందించాలనేదే నాకు ముఖ్యమన్నారు. భూమి ఎవరి పేరు మీద ఉంటే వారి వేలి ముద్ర ఉంటేనే చెల్లుతుందన్నారు. భార్య పేరు మీద భూమి ఉంటే భర్త వేలిముద్ర పెడితే సరిపోదన్నారు. అందుకే భార్య భర్తలకు కూడా భద్రత ఉంటుందన్నారు. తాగుడుకు బానిసలైన భర్తలు భార్యల పేరుతో ఉన్న భూములు రాసివ్వడానికి కూడా వీల్లేదన్నారు. ఆధార్ లో ఫింగర్ ఫ్రింట్ ఉంటుందని, భూధార్ లో మీ భూమి వివరాలుంటాయన్నారు. రాబోయే రోజుల్లో జీవో రెఫరెన్స్ కూడా తీసుకుంటున్నామన్నారు. నెల రోజుల్లోపు చుక్కల భూముల సమస్యను పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. భూముల పట్టాలు ఎవరి పేరున ఉంటే వారందరికీ భూములు ఇప్పిస్తామన్నారు. త్వరలోనే గ్రామసభ పెట్టి ఎవరి పేరున ఉన్న భూములు వారికి అందేలా చేస్తామన్నారు. భూములు వారికి ఇప్పించడమే కాదు వారికి తానే ఫోన్ చేస్తానన్నారు.
ఎవరైనా ఒక్క పైసా డబ్బులు తీసుకుంటే వాళ్లను వదిలిపెట్టనన్నారు. ఒక్క పైసా డబ్బులు ఇవ్వకుండా నేరుగా మీకు పట్టాలు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. సర్వే అండ్ సెటిల్ మెంట్ లో ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి, జియో రెఫరెన్స్ ఫిక్స్ చేస్తామన్నారు. ఇవన్నీ కూడా దీంతో చేస్తామన్నారు. ప్రతి స్థలానికీ ఆధార్ తరహాలో ప్రత్యేక నెంబర్ తీసుకువస్తున్నామని అన్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. మోసాలు జరుగకుండా జాగ్రత్తగా భూధార్ అమలు చేస్తామన్నారు. వేలిముద్రల ఆధారంగానే భూ కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయన్నారు. భూములు సురక్షితంగా ఉన్నాయా.. లేదా అవినీతి రాహిత పాలన అందించడం ముఖ్యమన్నారు.