అలోక్ వర్మ పిటిషన్ పై విచారణ 29కి వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ ఇరుపక్షాల లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ అంశాలను లీక్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకులు చేయడంలో మీరంతా బిజీగా ఉన్నారంటూ సిజేఐ మండిపడ్డారు. సీవీసీ దర్యాప్తు వివరాలు ఎలా బయటకు వస్తున్నాయని చీఫ్ జస్టిస్ లాయర్లను ప్రశ్నించారు. సీల్డ్ కవర్లో సమర్పించిన సమాచారం బయటకు ఎలా వస్తుందని ప్రశ్నించారు.