న్యూఢిల్లి : కేంద్ర ప్రభుత్వం సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారి అన్నారు. అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కంటాక్స్ విభాగాలకు కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన సూచించారు. సిబిఐలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ సంస్థలో అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని తివారీ అన్నారు.