హనోయ్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ వియత్నాంలో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన హనోయ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ భారత్తో వియత్నాంకు ఎన్నో వేల ఏళ్ల సంబంధం ఉందన్నారు. 2 వేల ఏళ్ల క్రిందటే చామ్ రాజులు గొప్ప నాగరికతను ఏర్పాటు చేశారన్నారు. సముద్రాలు దాటి ఆ రాజులు వ్యాపారం చేసేవారన్నారు. దక్షిణ భారత్తో వియత్నాంకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత రామ్నాథ్... వియత్నాం మాజీ ప్రధాని హో చి మిన్ సమాధి వద్ద నివాళి అర్పించారు.