జమ్ముకశ్మీర్: ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ట్రం షోపియాన్ జిల్లా నదిగామ్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఆచూకీ కోసం సీఆర్ స్థానిక పోలీసులు, ఆర్మీ పారాట్రూపర్స్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాల సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య ఈ ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతిచెందగా.. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమచారం.