వియెత్నాంతో భారత్ పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, వియెత్నాం అధ్యక్షుడు గుయెన్ ఫు ట్రాంగ్ల సమక్షంలో అధికారులు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కమ్యూనికేషన్స్ రంగంలో ఒక ఎంఒయు కుదుర్చుకున్నారు. అలాగే హోచిమిన్ నేషనల్ అకాడమీ ఆఫ్ పాలిటిక్స్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.