శబరిమల వివాదంపై కేరళలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా స్పందించారు. పోలీసులు మహిళలను తోసివేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారని అమిత్షా అన్నారు. నిరసనకారుల పట్ల ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అనుసరిస్తున్న తీరు తనకు అసంతృప్తి కలిగించిందని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమాల పట్ల విజయన్ సరైన రీతిలో స్పందించడం లేదని ఆయన అన్నారు. ప్రతి అయ్యప్ప భక్తుడికి తాము అండగా ఉంటామని అమిత్షా అన్నారు.