ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుధవారం చెన్నై వెళ్లనున్న పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 20, 2018, 09:16 AM

బుధవారం చెన్నై వెళ్లనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.  ఏపీలో చురుగ్గా ఉన్న పవన్ ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన చెన్నై వెళ్తున్నట్టు సమాచారం. అక్కడ తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.


నిజానికి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించామని, అయితే, ఎన్నికలు ముందుగా జరుగుతుండడంతో బరిలోకి దిగడం కష్టమనే ఉద్దేశంతోనే తప్పుకున్నట్టు సోమవారం జనసేన ప్రకటించింది. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com