ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంజన్ లేని రైలు ప్రత్యేకతలివే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 20, 2018, 08:27 AM

భారతీయ రైల్వే మరో ముందడుగు వేసింది. అత్యంత వేగవంతమైన రైలును విజయవంతంగా పరీక్షించింది. ట్రైన్‌-18గా పిలుస్తున్న అత్యంత వేగంతో ప్రయాణించే రైలు అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకొని అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇంజన్‌ లేని రైలు అయిన ట్రైన్-18 గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. ఇది భారతీయ రైల్వేలో సరికొత్త మార్పుగా నిపుణులు చెబుతున్నారు. పరీక్షలో భాగంగా బోగీల్లోని సీట్లలో ప్రయాణికులకు బరువుకు సరితూగే ఇసుక బస్తాలను ఉంచారు. 


ప్రస్తుతం దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ మార్గాల్లో ఈ అత్యాధునిక రైలును అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ రైళ్లకు ఉన్నట్లుగా దీనికి ఇంజన్ లేకపోవడం ఈ రైలు ప్రత్యేకత. స్వయంచాలిత శక్తి ద్వారా పనిచేసే ప్రత్యేక ఇంజన్ ద్వారా ఇది పట్టాలపై పరుగులు పెడుతుంది. 


ఢిల్లీ-ముంబై రాజధాని మార్గంలో సవాయ్‌ మాధోపూర్‌-కోట మధ్య ఆదివారం (నవంబర్ 19) గంటకు 180 కి.మీ. వేగంతో దీన్ని పరీక్షించారు. ట్రైన్‌-18 పూర్తి గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. అయితే.. ప్రతిపాదిత వేగం కంటే 10 శాతం అదనపు వేగంతో దీన్ని పరీక్షించారు. ట్రైన్‌-18ను సుమారు 80 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే దీన్ని మొరదాబాద్‌ - షహరాన్‌పూర్‌ మధ్య గంటకు 115 కి.మీ. వేగంతో రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎస్‌వో) పరీక్షించింది. ఈ పరీక్షల్లో ట్రైన్‌-18 విజయవంతమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com