తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే టైంస్లాట్ సర్వదర్శన౦, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మరోవైపు ఈరోజు తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు.