పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ బీజేపీయేతర పక్షాలు కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. దేశాన్ని రక్షించేందుకు కలిసి కట్టుగా నడుస్తామన్నారు. ఇంతకుముందు కర్ణాటకలో కూడా చర్చలు జరిపామని.. ఇప్పుడు కూడా అదే అంశం మీద చర్చించుకున్నామని.. దేశాన్ని, రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోడానికి కలిసి నడుస్తామన్నారు.