విశాఖపట్నం : విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత పై జరిగిన దాడి కేసుకు సంబధించి సిట్ ఈ రోజు జగన్ కు నోటీసులు జారీ చేసింది. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొంది. జగన్ పై విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి గత నెల 25న దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడిపై విచారణకు ఏపీ సర్కార్ సిట్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే.