నెల్లూరు: సిబిఐని కేంద్ర ప్రభుత్వం గుపిట్లో పేరుకుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సిబిఐ అనుమతి అంశం అన్నది పూర్తిగా రాష్ట్రప్రభుత్వాల హక్కు అన్న ఆయన ఏపీ హక్కుల కోసం టీడీపీ పోరాడుతుంటే ప్రతిపక్షాలు మోడీతో లాలూచీ పడ్డారని.. ఏపీ హక్కులు సాధించుకునే వరకు ప్రభుత్వం పోరాటం ఆగదన్నారు. సిబిఐలో అంతర్యుద్ధం వచ్చాక.. విశ్వసనీయత అంశం ఎక్కడ ఉందని.. అలంటి పరిస్థితిలోనే మేము సిబిఐకి అనుమతిని ఉపసంహరించుకున్నామన్నారు. మొత్తం దేశంలోని 29 రాష్ట్రాలలో సిబిఐకి అనుమతి ఇచ్చింది కేవలం 9 రాష్ట్రాలేనన్నారు. బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రం కూడా సిబిఐకి అనుమతి ఇవ్వలేదని.. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ బాటలోకి వస్తున్నాయన్నారు. ఆర్బీఐ గవర్నర్ కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందని.. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసే పరిస్థితి తెచ్చారన్నారు.