ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలలో పోలీసుల చర్యను సమర్థించిన పినరాయి విజయన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 04:42 PM

తిరువనంతపురం : శబరిమలలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ సమర్థించారు. సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించిన కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన అన్నారు. తమ అజెండా అమలు చేయడానికి సంఘ్‌ పరివార్‌ చేస్తున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. అరెస్టయిన వారు అయ్యప్ప భక్తులు కాదని, సన్నిధానం వద్ద అల్లర్లు చేయడానికి వచ్చిన ఆరెస్సెస్‌ కార్యకర్తలని ముఖ్యమంత్రి చెప్పారు. శబరిమలలో ఇబ్బందులు సృష్టించాలనుకునే వారిని ప్రభుత్వం ఉపేక్షించదని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com