ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర సహాయమంత్రి హన్సరాజ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 03:30 PM

శ్రీకాకుళం జిల్లా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ పర్యటిస్తున్నారు. టెక్కలి మండలం కొత్తూరులో శివ సాయి గ్రానైట్ పరిశ్రమను, తిర్లంగి, గంగాదేవి పేటలో రహదారులు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ రహదారులను, మదనగోపాల సాగరం గండిని పరిశీలించారు. వజ్రపుకొత్తూరు మండలం శారదా పురం, చిన్న వంక, డోకులపాడు గ్రామాల్లో ప్రజల తో మాట్లాడారు. ప్రజలు తమకు సహాయం పెంపొందించాలని కోరారు. బాధితులను, ముఖ్యంగా మత్స్యకారులు రైతులను ఆదుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్,  ఎన్ డి ఆర్ ఎఫ్  కమాండెంట్ జారెడ్, డిప్యూటీ కమాండెంట్ లవ కుమార్, హోమ్ శాఖ విపత్తులు విభాగం డైరెక్టర్ సుధీర్ కుమార్ రాయ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com